telugudanam.co.in

      telugudanam.co.in

   

ఆకుపచ్చని ఆరోగ్యం


ఆహారపోషణలో ఆకుకూరల ప్రాధాన్యత


అన్నీ సమపాళ్ళలో ఉన్న ఆహారం

నార లేదా పీచు తో కూడిన స్వాభావిక ఆహార పదార్ధాలు మనం తీసుకునే భోజనంలో 50 శాతం దాకా తప్పనిసరిగా ఉండాలి. కండరాల కదలికలకు నార లేదా పీచుతో కూడిన ఆహారపదార్ధం సహాయపడుతుంది. తాజా కూరగాయలతో కూడిన సలాడ్ లు, బచ్చలి కూర, మరీ ఎక్కువగా ఉడకని కాయగూరలు కలసి జీర్ణశక్తిని పెంచుతాయి. సాధ్యమైనంత వరకు వేపుడు పదార్ధాలను, మసాల కలిపిన ఆహారపదార్ధాలను తినడం మానండి, దీనివల్ల కడుపులో ఆమ్లత్వము పెరిగి చిర్రుబుర్రులాడే మనస్తత్వము అలవడుతుంది. కడుపునిండా కాకుండా సగం కడుపునిండేలా తినండి. భోజనంతో పాటు నీళ్ళను తాగకండి. జీర్ణ కోశంలో ఉత్పత్తి అయ్యే రసాలను తాగే నీళ్ళు పలుచపరుస్తుంది. భోజనం చేసిన అరగంట తరువాత నీళ్ళను తాగండి. రాత్రి అన్నము అన్నది పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు చేయండి. ప్రొద్దున్నే లేచిన తరువాత గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని ఒక గ్లాసుడు నీళ్ళు తాగండి. ఇది పేగులను వదులుగా చేసి పేగుల విసర్జన క్రియను సులభతరం చేస్తుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: