|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
చిట్కాలు
ఆరోగ్యానికి సంబంధించినవి
చిన్న దెబ్బలు - చిట్కా వైద్యాలు
10-15 తులసి ఆకులు తీసుకొని దానికి నాలుగు వెల్లుల్లి పాయలు, ఒక టీస్పూను శొంఠి పొడిని జతచేసి మెత్తగా నూరి ఆ మెత్తటి మిశ్రమాన్ని నుదుటికి రాసుకోవాలి.
అరకప్పు నిమ్మరసంలో కాస్త అల్లం రసం కలుపుకొని తాగితే దగ్గునుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా రోజుకి రెండు మూడు సార్లు తాగితే ఫలితం ఉంటుంది.
అల్లం ముక్కను నిప్పుల మీద కాల్చి తింటే వికారం తగ్గుతుంది.
ఇంగువ జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలకు మందుగా పని చేస్తుంది. బోజనానంతరం ఒక చిటికెడు ఇంగువ, చిటికెడు ఉప్పును మజ్జిగలో కలిపి తీసుకుంటే గ్యాస్ తగ్గుతుంది. దీనివల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.
ఉల్లిపాయల్ని మెత్తగా నూరి ఆ ముద్దని నుదుటి మీద పెట్టుకుంటే తలనొప్పి బాధ నుంచి ఉపశమనం పొందుతాం.
ఐదు లేదా పది మిరియాలను మెత్తగా పొడి చేసి చక్కెర లేదా నేతితో కలిపి తీసుకుంటే మామూలు జలుబు, ముక్కు కారడం, గొంతులో దురద, నోరు అతుక్కుపోయినట్టు అవ్వడం, గొంతునొప్పి, దగ్గు, జ్వరం ల నుండి ఉపశమనం లభిస్తుంది.
ఒక చిటికెడు మిరియాల పొడిని మజ్జిగలో వేసుకొని ప్రతి రోజు తాగుతుంటే అరుగుదల క్రమబద్దం అవుతుంది.
కండరాల నొప్పులు, కీళ్ళనొప్పులు ఉన్న ప్రాంతంలో ఒక టేబుల్ స్పూను మిరియాల పొడిని ఆవ నూనె వేసి వేడిచేసి గోరువెచ్చగా చేసి రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
కడుపు ఉబ్బరం కారణంగా కడుపునొప్పి ఉన్నప్పుడు కొంచెం వాముని వేడి చేసి ఒక కప్పు నీటిని జోడించి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. దీంట్లో ఒక చిటికెడు ఉప్పు లేదా పంచదారని కలిపి తాగాలి. కాస్త వాముని ఉప్పుతో కలిపి నమిలినా అజీర్తి ఉపశమనంగా పనిచేస్తుంది.
కడుపు నొప్పిగా ఉండి, నొప్పి ఎందుకు వస్తుందో అర్ధం కానపుడు కొంచెం జీలకర్రని తీసుకుని వేడి చేయండి. ఇఫ్ఫుడు వాటికి ఒక కప్పు నీటిని చేర్చి నీరు సగం అయ్యే వరకు మరిగించండి. ఈ నీటిలో రెండు మూడు చుక్కలు నెయ్యిని వేసి తాగండి. అది గ్యాస్ వల్ల వచ్చిన కడుపు నొప్పి అయితే తగ్గుతుంది. నొప్పి ఇంకా ఉంటే మాత్రం డాక్టరుని సంప్రదించాలి.
కడుపునొప్పిగా ఉన్నప్పుడు ఇంగువని నీటిలో కలిపి బొడ్డుమీద ఉంచాలి.
కళ్ళకలక వచ్చినప్పుడు దూదిని ధనియాలు నానేసిన నీటిలో ముంచి కళ్ళను తుడిస్తే ఉపశమనంగా పనిచేస్తుంది.
కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని కంటి మీద రాసి చూడండి.
కాలిన మచ్చలకు తేనె రాస్తే కాలిన మచ్చలు పోతాయి.
కాళ్ళు చేతులు బెణికి నట్లయితే ఉప్పుతో కాపడం పెడితే తగ్గుతుంది.
కాస్త చింతపండు గుజ్జు, టమాటారసం, మిరియాల పొడి, ఒక మిరపకాయ, కాస్త ఉప్పులతో తయారు చేసిన సూప్ని వేడిగా తాగితే జలుబు, ముక్కు కారటం తగ్గుతాయి.
కాస్త దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూను తేనె, కొంచెం మిరియాల పొడి, రెండు చుక్కల నిమ్మరసం ఇవన్నీ కలిపి తీసుకుంటే సాధారణ జలుబు తగ్గుతుంది.
కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు మాయమవుతాయి.
క్రమం తప్పకుండా ధనియాలు వాడుతుంటే అధిక రుతుస్రావం ఆగుతుంది.
గొంతు బొంగురు పోతే బెల్లం, మిరియాలు కలిపి ఉండచేసి బుగ్గన ఉంచుకుని మెల్లమెల్లగా రసాన్ని మింగితే తగ్గిపోతుంది.
చంటి పిల్లలకు జలుబు చేసినప్పుడు ముద్ద కర్పూరం పొడి చేసి కొబ్బరి నూనెలో కలిపి గుండె, గొంతు, వీపు, ముక్కు - వీటి మీద పట్టించి సన్నని వస్త్రం మీద కప్పాలి. దీని వలన లోపల ఉన్న నెమ్ముని చాలా వరకు తీసివేయవచ్చు.
తరచూ తలనొప్పితో బాధపడేవారికి ఐస్ మంచి మందని వైద్యులు చెపుతున్నారు. ప్లాస్టిక్ కవర్లో ఐస్ ముక్కల్ని వేసి దానిని తల, నుదురుల మీద పెట్టుకోవాలి.
తాగే నీటిలో సాజీరాను వేసి పది నిముషాల పాటు వేడి చేసి తాగితే పొట్టలో నులి పురుగులు, చెడు శ్వాస సమస్యలు తగ్గుతాయి.
తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం లేదా గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉండడంలాంటి ఉదరసంబంధ సమస్యలకు పావు టీస్పూను మిరియాలపొడిని మజ్జిగలో వేసుకొని తాగి చూడండి.
తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున వేసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది.
తులసి ఆకులను నమిలితే జీర్ణశక్తి మెరుగవుతుంది. తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే వాంతులు ఆగుతాయి.
తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది.
తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
తులసి ఇంట్లో ఎప్పుడూ ఉండదగిన ఔషధం. దీని ముదురు ఆకులను పొడి చేసి అందుబాటులో ఉంచుకోవాలి. ఆకుల రసం కూడా శ్రేష్టమైనదే.
తులసి కషాయాన్ని తాగితే కాలేయానికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. ఆకలి మందగించిన వారు తులసి ఆకుల రసం తీసి దానితో తమలపాకు రసమును, పంచదారతో చేర్చి కొద్ది మోతాదులో ప్రతినిత్యం సేవించిన జీర్ణక్రియ సరిగా జరిగి ఆకలి బాగా వేస్తుంది.
తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుంది.
తులసి రసమును తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది.
తులసి
రసాన్ని
తేనెలో
కలుపుకొని
తాగితే
జలుబు,
దగ్గు
నుంచి
ఉపశమనం
కలుగుతుంది.
తులసి
శ్లేష్మ,
కఫ,
వాతములను
హరిస్తుంది. తులసి
ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు. తులసి
శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది.
తేనెతో కలిపి నిమ్మకాయ రసం పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు గొంతు గరగర తగ్గాలంటే లవంగాన్ని చప్పరించాలి.
దాల్చిన చెక్కని వేసి కాచిన నీటిని తాగుతుంటే వాంతులు తగ్గుతాయి.
దోమకాటు వల్ల ఏర్పడిన దద్దుర్లు పోవాలంటే వాటి మీద ఉల్లిపాయ ముక్కతో రుద్దాలి.
ధనియాలను నీళ్ళలో నానవేసి ఆ నీటిని తరచుగా తాగుతుంటే వాంతులు తగ్గుతాయి.
నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
నిమ్మరసంలో జీలకర్ర నానేసి వరుసగా ఏడు రోజులపాటు, రోజూ ఉదయం కొంచెం తింటుంటే పైత్యం తగ్గుతుంది.
నీటిలో మెంతులు వేసి చేసిన టీ తాగితే కడుపులో మంట తగ్గుతుంది.
నీళ్ళలో తులసి ఆకులు వేసి రాత్రంతా అలా ఉంచి ఉదయాన్నే పరగడుపున తాగితే జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు సమసిపోతాయి.
పచ్చి కాయ కూరలు, పళ్ళు చర్మం ఆరోగ్యంగా ఉండడానికి అవసరం.
పలుచగా తయారుచేసిన చింతపండు రసంలో చిటికెడు ఉప్పు వేసి మరిగించి ఆ నీటితో నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.
పళ్ళు స్వచ్ఛంగాను, పటిష్టంగాను ఉండాలంటే ఉప్పు పొడిలో నాలుగైదు చుక్కలు ఆవ నూనెను కలిపి ప్రతిరోజూ పేస్టులాగా వాడాలి. నోటి దుర్వాసన పోవటానికి కుడా ఇది ఉపయోగపడుతుంది.
పసుపు జీర్ణవ్యస్థలో సమస్యలను తగ్గించగలుగుతుంది. అరుగుదలకు మందుగా పని చేస్తుంది.
పాలల్లో కాస్త పసుపు కలిపి కాచుకొని తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. జలుబుతో ముక్కు కారుతున్నప్పుడు పసుపు కొమ్ముని కాల్చి ఆ వాసనని పీల్చాలి.
పులిహొర తింటే కడుపు బరువుగా ఉన్నట్లు ఉంటుంది. ఆ బరువు తగ్గాలంటే ఒక చిట్కా ఉంది పులిహొర తిన్న వెంటనే - గోరు వెచ్చని నీరు ఒక గ్లాసుడు తాగేస్తే - తొందరగా జీర్ణం అవుతుంది. వేడి కూడ చేయదు.
పొట్టకి సంబంధించిన పలు సమస్యలకు వెల్లుల్లి మంచి మందు, ఒకటి రెండు రెబ్బల వెల్లుల్లిని మెత్తగా నూరి ఆ రసాన్ని అరకప్పు నీటిలో కలిపి తాగాలి. దీని వల్ల అరుగుదల, పొట్టలో పురుగులు నశించటం, శరీరంలోని విష పదార్ధాలు నశించటం, కొలెస్ట్రాల్ నియంత్రణ, తక్కువ స్థాయిలో ఉన్న విరేచనాలు తగ్గుతాయి.
పొద్దున లేవగానే ఖాళీ కడుపుతో యాపిల్ పండు తింటే తలనొప్పి సమస్య తొందరగా తలెత్తదు.
ప్రతి రోజు అల్లంతో చేసిన టీని తాగుతుంటే జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపులో మంట మొదలైన పొట్టకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
ప్రతిరోజు గోధుమ జావ తాగితే బీపీ ఉన్నవారికి మంచిది.
బాదం పప్పు, గసగసాలు కలిపి తింటే రక్తం శుద్దియగును.
బొప్పాకాయను కానీ, ఆకుని కానీ మెత్తగా కాటుకలా నూరి ఆ ముద్దని అరికాళ్ళ ఆనెల మీద పెట్టి, కట్టుకడితే అవి మెత్తబడతాయి.
మజ్జిగలో కాస్త అల్లం పొడిని, ఉప్పుని కలిపి తీసుకుంటే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి.
మజ్జిగలో కొంచెం పసుపు, కాస్త ఉప్పు కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి.
మిరియాలతో దగ్గు, జలుబు, గొంతు నొప్పుల నుంచి ఉపశమనం ఇచ్చే మందుని తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు మంచినీరు, ఐదు లేక ఆరు మిరియాలు, ఒక ముక్క తెల్ల ఉల్లిపాయ, చితక్కొట్టిన అల్లం ముక్క ఒకటి, చిన్న బెల్లం ముక్క ఇవన్నీ వేసి నీరు సగం అయ్యేంత వరకు కాచండి. వేడిగా ఉండగానె తాగండి. దీనిని సేవించడం వల్ల పైన చెప్పిన చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
మిరియాలు మంచి ఘాటు వాసనను కలిగి ఉంటాయి. ఈ కారణంగానే వీటిని మసాజ్ ఆయిల్ తయారీలో ఒక పదార్థంగా ఉపయోగిస్తారు. ఈ ఆయిల్తో మర్థనా చేసుకోవడం లేదా కొన్ని చుక్కలు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కండరాల నొప్పులు, మామూలు నొప్పులు, గాయాలనుండి రసికారడాన్ని అరికట్టడంలో ఎంతో ప్రతిభావంతంగా పని చేస్తుంది.
యాలుకలు వేసిన టీ సువాసన భరితంగా రుచిగా ఉంటుంది. నోటి దుర్వాసనని తగ్గిస్తాయి.
రోజుకు కనీసం 6 గ్లాసులు నీళ్ళు త్రాగి మలబద్ధకం రాకుండా చూసుకుని చర్మాన్ని అందంగా ఉంచుకోవచ్చు.
లవంగాన్ని చప్పరించటం వల్ల నోరు తాజాగా ఉంటుంది.
లవంగాల పొడికి కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూను తేనెని కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.
లవంగాల్ని మెత్తగా పొడి చేసి అందులో దాసించెక్క ఆయిల్ కలిపి తలపై ఎక్కడయితే నొప్పిగా అనిపిస్తుందో అక్కడ పూయాలి.
లావు కావాలనుకున్నవారు మధ్యహ్నం భోజనంలో గంజి వేసుకొని తింటుంటే ఫలితం ఉంటుంది.
లావుగా ఉన్నవారు సన్నబడాలంటే ప్రతి నిత్యం లేతములగాకు (ములగచిగుళ్ళు) రసం తాగుతూ ఉండాలి.
విరేచనాలు అవుతున్నప్పుడు మెంతిపొడిని ఒక అరకప్పు నీటితో కలిపి పొద్దున్నే తాగాలి. ఈ పొడిని మజ్జిగతో కలిపి తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది.
వేగించిన వాముని ఉండలా చేసి పలుచని గుడ్డలో పెట్టి దానిని తలనొప్పి తీవ్రత తగ్గేదాక ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తుండాలి.
వేడి నీటిలో కొద్దిగా తేనె వేసుకొని తాగితే జలుబు భారం తగ్గుతుంది.
శొంఠి, మిరియాలు, వాము, సైంధవలవణం అన్నీ కలిపి మెత్తగా నూరి తేనెతో తీసుకుంటే అతిగా వచ్చే ఆవలింతలు తగ్గుతాయి.
శొంఠిని మెత్తగా నూరి ఆ పొడిని నీటిలో కలిపిన తలకు రాసుకోవాలి. ఇలా రాసుకున్నప్పుడు కాస్తంత మంటగా అనిపిస్తుంది. కాని నొప్పి తీసేసినట్టు పోతుంది. శొంఠి పేస్టుని చెవుల వెనుక రాసుకుంటే కూడా మంచిది.
సగంకప్పు నీటిలో కొద్దిగా మిరియాల పొడి వేసి చిన్నమంటపై మరిగించాలి. ఈ నీరు గోరువెచ్చగా అయ్యాక కాసిన్ని నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించాలి ఇలా చేస్తే పంటినొప్పి తగ్గుతుంది.
సోపు కూడా అజీర్తి సమస్యలకు, గ్యాస్కి చక్కగా పనిచేస్తుంది. అన్నం తినగానే ఒక టీస్పూను సోపుని తినవచ్చు. లేదా మీరు మంచినీరు కాచి తాగేవారైతే ఆ నీటిలోనే సోపుని వేసుకోవచ్చు.
స్నానం చేయించిన పిదప పిల్లలకు చిటికెడు పసుపు మాడున రుద్దటం వలన కూడా కొంతవరకు జలుబు అరికట్టవచ్చును.
స్వచ్చమైన తెల్లని గుడ్డ తీసుకొని దానిని వైట్ వెనిగర్లో ముంచి తలచుట్టూ చుట్టుకోవాలి. ఇలా తలనొప్పి పోయిందనిపించేంత వరకు కొన్ని నిముషాల వ్యవధితో చేస్తుండాలి.
తేనె వాడకం వల్ల ఉపయోగాలు, ఆరోగ్య సూచనలు
అతి మూత్రవ్యాధి ఉన్నవారు రాత్రి నిద్ర పోయే ముందు ఒక చెంచా తేనె పుచ్చుకుంటే మాటి మాటికి మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు.
ఆరు నెలలు పూటకు రెండు ఔన్సుల చొప్పున తేనె పుచ్చుకుంటే గుండెకు మేలు చేస్తుంది.
ఎదిగే పిల్లకు పోషకాహారంగా తేనె ఎంతో ఉపకరిస్తుంది.
ఒక చెంచా తేనె, ఒక నిమ్మకాయరసం, అరగ్లాసు నీటీలో కలిపి తీసుకుంటే వడదెబ్బను నివారించవచ్చు.
క్రీడాకారులు ఆటల్లో పాల్గొనబోయే ముందు తేనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుంటే ఉత్సాహం, ఉత్తేజం కలిగి త్వరగా అలసట కలుగదు. ఆటలు ఆడిన తర్వాత తీసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.
తేనె పుచ్చుకుంటే కళ్ళకు చలువ చేసి దృష్టి మెరుగుపడేలా చేస్తుంది.
తేనె, నిమ్మరసం సమభాగాలుగా తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి, గొంతు గరగర, గొంతు బొంగురుపోయినట్లుండటం వంటి బాధలు తగ్గుతాయి.
తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలను గర్భిణీలు రోజూ ఉదయం, సాయంత్రం ఒకటి లేదా రెండు తింటే పుట్టబోయే బిడ్డకు బలవర్ధకం.
తేనెలో కొద్దిగా ఆముదం చేరిస్తే మంచి విరేచనకారిగా పనిచేస్తుంది.
పంచదారకు బదులుగా తేనెను వాడటం వల్ల ఆరోగ్యదాయకంగా పనిచేస్తుంది.
ప్రకృతిలో సహజసిద్దంగా లభించే ఆహారపదార్ధాలలో తేనె ఉత్తమమైనది, పుష్టికరమైనది.
భోజనానంతరం తీసుకుంటే పైత్యహారిగా పనిచేస్తుంది. శరీరంలోని అధిక వేడిని తొలగిస్తుంది.
మనం తీసుకొనే ఆహారపదార్ధాలు, పానీయాలు మొదలైనవి జీర్ణక్రియలో భాగంగా గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్లుగా మారిన తరువాత క్రమంగా జీర్ణం అవుతాయి. కానీ తేనె ఇలా ఏ మార్పులూ లేకుండా సులభంగా జీర్ణం అవుతుంది.
రెండు తులాల తేనెలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని రోజూ తాగితే పులితేపులు తగ్గుతాయి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in