telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

నూతన సంవత్సర వేడుకలు

కొత్త కొత్త ఆశలతో... నూతన ఆలోచనాల విధానాల సరళితో మార్పులు కోరుకొంటూ... మనిషిగాపుట్టిన ప్రతి ఆశాజీవి రాబోయే సంవత్సరం మరింత శోభాయమానంగా ఉండాలనే ఆకాంక్షతో పాత సంవత్సరపు వైభవాన్ని నెమరువేసుకొంటూ...విషాధచాయలని వదిలించుకొంటూ కనీసం కొత్త సంవత్సరం లో అడుగు పెట్టేవేళ అన్నీ శుభాలే కలగాలని ఆశిస్తూ వేడుకగా కులమతాలకతీతంగా, సనాతన సాంప్రదాయాలపట్టింపులు లేకుండా అన్ని దేశాలలో సర్వమానవ సౌబ్రాతృత్వం పరిపొందేలా వయో బేధం లేకుండా... పేద, గొప్ప అందరూ తమ శక్తికొద్ది జరుపుకొనే వేడుకే ఈ నూతన సంవత్సర సంబరం. ఈ నూతన సంవత్సరానికి ఆది అంతం అనేది ఉండదు. నూతనత్వాన్ని కోరుకోవడము లోనే గొప్ప మార్పు అనేది కనిపిస్తుంది. అలా ఆలోచించబట్టే ఆది మానవుడు నేడు అణుమానవుడైనాడు.


సంవత్సరం అంతా న్యూ ఇయరే...

జనవరి 1 న ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే కొన్నిదేశాలలో, కొన్ని ప్రాంతాలలో ఈ నూతన సంవత్సరంను ఒకొక్కరు ఒక్కొక్క నెలలో జరుపుకోవడం విశేషము. ఆరకంగా సంవత్సరంలో వచ్చే ప్రతినెలలోనూ ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు చోటు చేసుకోవడం గమనార్హం.

క్రైస్తవ సంప్రదాయం ప్రకారం...

మామూలుగా అందరం జనవరి 1 వ తేదీన ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాము. ఇది మెసపటోమియా నాగరికత కాలములో సుమారు రెండువేల సంవత్సరాల క్రితం ఈక్వినాక్స్ పాలన కాలములో మార్చినెల సగం రోజుల తరువాత ఈజిప్షియంసు పెర్షియంసు, ఫోనిషియంసు, గ్రీక్సు వేడుకగా జరుపుకొనేవారు. సాధారణంగా వసంత కాలములో మొదలై శిశిర కాలములో ముగుసేది. అయితే దానిని నూమా పాంపిలియం పాలనలో 12 నెలలగా క్యాలెండరును మార్చారు. చంద్రమానం ఆధారంగా ఆ క్యాలెండర్ తయారు చేశారు. అప్పటిదాకా 10 నెలలతోనే ఉన్న ఆ క్యాలెండర్ లో రోజులను కుదించి నెలకు 30 రోజులు వచ్చేలా చేసి జనవరి, ఫిబ్రవరి నెలలను కూడా ఆ క్యాలెండర్లో చేర్చడమేకాకుండా... జనవరి 1 నుంచి నూతన సంవత్సరం ఆరంభం అవుతుందని ప్రకటించారు.


హిందూ సంప్రదాయం...

హిందువులుకూడ మొదట్లో చంద్రుని గమనాన్ని లెక్కలు వేసుకొని విక్రమశకాన్ని మూలంగా తీసుకొనేవారు. క్రీ.పూ. 57 సం|| లో విక్రమ సకం ప్రారంభం అయినది అంటారు. అంతకుముందు మొదట్లో దీనిని తర్వాతవచ్చే కార్తీకమాసం తొలిరోజున నూతన సంవత్సరం మొదలుగా జరుపుకొంటారు. హిందువులందరూ అమితంగా కీర్తించే విక్రమాదిత్యుని పాలనకు ముందు శకవంశానికి చెందిన శకస్ధునుడి పాలన సాగుతుండేది. ఒకసారి గార్ధబిల్ల అనే రాజు వేటకు వెళుతుండగా మార్గ మధ్యమ్లో సరస్వతి అనే వితంతువుని చూసి చెరపడతాదు. ఆమె జైన సన్యాసి అయిన అల్మాచార్య సోదరి. అప్పుడు ఆ సన్యాసి అప్పుడాసన్యాసి గత్యంతరం లేక శక వంశానికి చెందిన శకస్తన మహారాజును చేరుకొని తనని రక్షించమని వేడుకొన్నాడు. అప్పుడు శకస్థనుడు గార్ధబిల్లుని పై దండెత్తి అతనిని ఓడిస్తాడు. ఓటమి పాలైన గార్ధబిల్లుడు అడవుల పాలై పులిచేతిలో మరణిస్తాడు. అతనికుటుంబం కూడా అడవుల పాలవుతుంది. తరువాత అతని కుమారుడైన విక్రమాదీత్యుడు. సైన్యాన్ని సమీకరించుకొని కొంతబలాన్ని సమీకరించుకొన్నాక నాటి శకవంశపు రాజును ఓడించి తాను సింహాసనాన్ని అధిష్టించడమేగాక... జనరంజకంగా పాలించాడు. ఆయన పాలననే హిందువులు నేటికీ పంచాంగములలో విక్రమ నామ శకంగా చెప్పుకొంటారు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం